తల్లి పురుగు

కోశాస్థ దశకు వెళ్ళిన తరువాత  6 – 8 రోజుల లోపల  రెక్కల  పురుగు బయటికి వస్తుంది.  ఆడ, మగ పురుగులు కలిసే దశ ఇది. అయితే ఈ దశలో పురుగు పంటకు  ఏ మాత్రం నష్టం చేయదు. 

           తల్లి  పురుగు సైజు  మధ్యస్తంగా ఉంటుంది. తెల్లటి రెక్కలుంటాయి. వాటిపై పెద్ద సైజులో గోధుమ రంగు మచ్చలు,  ఎర్రటి గుర్తులు మాదిరి ఉంటాయి.  

           రెక్కల నిడివి 3/4 అంగుళం మేర ఉంటుంది. తల, గొంతు భాగం నలుపు గోధుమ రంగులో ఉంటాయి.