తెగులు సోకిన మొక్క ఎండిపోవడం ఈ తెగులు ప్రధాన లక్షణం. తొలుత ఈ భాగాలు పసుపు రంగులోకి మారుతాయి. అదే క్రమంలో మొక్క ఎదుగుదల నిలిచిపోతుంది. ఆకులు వడలి రాలిపోతాయి. వేర్ల ద్వారా మొక్కలోని ఆయా భాగాలకు నీరు తగినంతగా అందకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. చివరకు మొక్క చచ్చిపోతుంది.
తెగులు సోకిన కాండాన్ని రెండుగా చీల్చినట్లయితే, కాండం లోపలి కణజాలం నల్లటి ముద్దలుగా మారినట్టు కనపడుతుంది. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కాండం మొత్తం నల్లగా మారుతుంది.