అమృత జలం:

కావలసిన పదార్ధాలు :

  1. ఆవు మూత్రం 1 లీటరు
  2. ఆవు పేడ 1 కిలో
  3. బెల్లం (అర్గనిక్) పావు కిలో (25౦ గ్రాములు)
  4. క్లోరిన్ కలపని నీళ్ళు 10 లీటర్లు `

తయారు చేసి, వాడే పద్ధతి

పైన పేర్కొన్న పదార్ధాలు అన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో గాని, మట్టి కుండలో గానీ కలిపి 24 గంటలు ఉంచాలి. ఆ తరువాత ప్రతి లీటరు అమృత జలానికి 10 లీటర్ల నీళ్ళు కలిపి నైలాను నెట్ తో వదపోయాలి. వడపోసిన ద్రవాన్ని పిచికారి చేయాలి.

అమృత జలాన్ని ౩౦ రోజుల పాటు నిలువ ఉంచవచ్చు.  యూరియా చల్లినప్పుడు ముక్కలు ఏపుగా పెరగడమే కాక, మొక్క నాజూకుగా మారి పురుగులు, తెగుళ్లకు ఎక్కువగా ఆశిస్తాయి.  కానీ, అమృత జలాన్ని చల్లినప్పుడు మొక్కలకు నత్రజని అభ్యమవ్వడమే కాకా హాని చేసే పురులను, సూక్ష క్రిములను దూరంగా ఉంచుతుంది. 

మోతాదు

బాగా ఎదిగిన పొలానికి బర్రె /ఆవు /ఎద్దు మూత్రం 20 లీటర్లు, 20 కిలోల పేడ , 5 కిలోల బెల్లం, 15౦ లీటర్ల నీరు అవసరమయుతాయి.  పిచికారి చేయడం వేలుకాకపోతే , పొలానికి నీరు పెడుతున్నప్పుడు కలవ మొదట్లో నీళ్ళలో అమృత జలాన్ని కలిపి వాడవచ్చు.