|
సుడి దోమ పిల్ల దశలో దుబ్బుకి 10 పురుగులు, పూత దశలో దుబ్బుకి 20 నుంచి 25 పురుగులు కనపడతాయి. ఈ పురుగు మార్చి – నవంబర్ మధ్య కాలంలో పంటను ఆశిస్తుంది.
లక్షణాలు
గోధుమ వర్ణపు / తెల్ల మచ్చదోమలు దుబ్బుల అడుగున నీటి మట్టంపై వుండి దుబ్బుల నుండి రసాన్ని పిలుస్తాయి. పైరు సుడులు సుడులుగా ఎండిపోతుంది.
మొక్కలో పాడయ్యే భాగాలు
పైరు, ఆకులు, మొక్కలు
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
గుడ్లు తెల్లగా ఉంటాయి. ఆకుల ఈనెలలో, మట్టలలోని పొరల్లో ఉంటాయి. గుడ్ల అంచులు ఒకదానితో ఒకటి కలసిఉంటాయి. ఈ దశ 4-8 రోజుల పాటు ఉంటుంది.
పిల్ల పురుగు (లార్వా) దశ :
రెక్కలు ఉండవు. దుబ్బుల మోడళ్లలో చేరి రసాన్ని పీలుస్తాయి. ఈ దశలో 14-18 రోజులపాటు ఉంటుంది.
కోశాస్థ (ప్యుపా) దశ:
తల్లి పురుగు
తల్లిపురుగు గోధుమ రంగులో ఉంటుంది. 2-5 రోజులపాటు బతుకుతుంది. దుబ్బుల మొదళ్ళలో, నీటి మట్టానికి పైన గుంపులు గుంపులుగా ఉంటుంది.
పురుగును గుర్తించడం
- తల్లిపురుగు గోధుమ రంగులో ఉంటుంది. దుబ్బుల మొదళ్ళలో, నీటి మట్టానికి పైన గుంపులు గుంపులుగా ఉంటుంది.
- పిల్ల పురుగుకు రెక్కలు ఉండవు.
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
- లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల ఇతోఫెన్ఫ్రాక్స్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లి లీటర్ల బి.పి.ఎం.సి లేదా 0. 25 గ్రాముల ఇమిదాక్లోప్రిడ్ + ఎతిప్రోల్ 80 డబ్ల్యు.జి లేదా 2 మిల్లి లీటర్ల మొనోక్రోటోఫాస్ వంటి మందులను కలిపి చల్లాలి.
- తట్టుకునే రకాలు సాగు చెయ్యాలి.
- పొలాన్ని అడపా దడపా ఆరబెట్టాలి
- పొలంలో ఎప్పుడూ ఎక్కువగా నేరు నిలవ ఉంచకుండా చూడాలి. నీటిని తోడేస్తూఉండాలి.
- పంటలో ప్రతి రెండు మీటర్లకి మధ్య కాలిబాట వదలాలి . అప్పడు పంటకు గాలి బాగా ప్రసరించి పురుగు ఉద్రితి తగ్గుతుంది.
- 15 కిలోల ఇసుకకు 1.5 లీటర్ల వేప నూనె బాగా పట్టించి, రాత్రంతా ఉంచి, ఉదయాన్నే పొలంలో చల్లాలి.
అనుకూల వాతావరణం
తెలంగాణ, చిత్తూరు జిల్లాలో కంపు నల్లి ఉదృతి ఎక్కువ. ఈ పురుగు జూలై – నవంబర్ మధ్య కాలంలో
వస్తుంది.
లక్షణాలు
పురుగు ఆశించిన పొలం నుండి చెడు వస్తుంది. గింజలు తాలై పోతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
పిల్ల పురుగులు, పెద్ద పురుగులు రసాన్ని పీల్చడం వల్ల గింజలు తాలైపోతాయి.
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
తల్లి పురుగులు ఆకుల ఈనెల దగ్గర నిలువుగా వరుసలలో గుడ్లు పెడతాయి. ఈ దశ 6-7 రోజులు ఉంటుంది.
పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగులు సాయంత్రం, పొద్దున వేళల్లో ఎక్కువ నష్టం చేస్తాయి. మొక్క వెన్నుల నుండి రసాన్ని, గింజ పాలు పోసుకునే దశలో వాటినుంచి పాలను పీలుస్తాయి. దీనితో తాలు వస్తుంది. గింజ గట్టిపడే సమయంలో పీలిస్తే గింజ మీద మచ్చలు ఏర్పడతాయి. ఈ దశలో 25-30 రోజుల పాటు ఉంటాయి.
కోశాస్థ (ప్యుపా) దశ:
తల్లి పురుగు
తల్లి పురుగులు బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. ఇవి బాగా చెడు వాసన వదులుతాయి.. 7-10 రోజులు బతుకుతుంది.
పురుగును గుర్తించడం
దుబ్బుకి 1 లేక 2 పురుగులు కనపడతాయి. తల్లి పురుగులు బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
పురుగు నియంత్రణ – నివారణ పద్దతులు
లీటర్ నీటికి,. ఒక మిల్లి లీటర్ డైక్లోర్ వాస్, 2 మిల్లి లీటర్లు ఎండోసల్ఫాన్ లేక 2 మిల్లి లీటర్లు క్లోరిపైరిపాస్ లేక 2 మిల్లి లీటర్లు మలాదీయాన్ కలిపి గింజ పాలుపోసుకునే దశలో సాయంత్రం పూట పిచికారి చేయాలి. పొలం అంచు నుండి చుట్టూ తిరుగుతూ మధ్యకు పిచికారి చేయాలి.
అనుకూల వాతావరణం
వరి తెగుళ్ళు
- అగ్గి తెగులు లెక మెడవిరుపు తెగులు
అగ్గి తెగులు లేక మెడ విరుపు తెగులు నవంబర్ - ఫిబ్రవరి మధ్య కాలంలో వస్తుంది.
లక్షణాలు
అకులపై 1-౩ మిల్లి మీటర్ల వ్యాసం కలిగిన ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు పెద్దవై నూలుకండె ఆకారం పొందుతాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్ద మచ్చలుగా మారతాయి. పెద్దగా మారిన మచ్చలతో ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. నారుమడిలో ఆశిస్తే నారుమడి పూర్తిగా ఎండిపోతుంది. నాట్లు వేసిన తరువాత ఆశిస్తే మొక్క పూర్తిగా ఎదగదు. కురచగా ఉంటాయి. పిలకలు తగ్గిపోతాయి. వెన్నుల మెడభాగంలో వెన్నులు విరిగి పోతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, వెన్నులు
తెగులు జీవిత చక్రం
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- కిలో విత్తనానికి ౩ కార్బదైజింని కలిపి విత్తన శుద్ధి చేయాలి.
- లీటర్ నీటికి ౦.6 గ్రాముల ట్రైస్క్య్లోజేల్ 75 శాతం లేదా 1.5 మిల్లి లీటర్ల ఇసోప్రోధ్యున్లెన్ లేదా 2.5 మిల్లి లీటర్ల కసుగా మైసిన్ ౩ ఎల్ కలిపి పైరుపై పిచికారి చేయాలి.
- తట్టుకునే వంగడాలు వాడటం ( పినాకిని, ఫాల్గుణ, తిక్కన వంటివి)
- విత్తన శుద్ధి చేయడం (ఆవు మూత్రంతొ)
500 మిల్లి మీటర్ల పశువుల మూత్రాన్ని ఒక బకెట్లో తీసుకుని, దానికి రెండున్నర లీటర్ల నీటిని కలపాలి. వరి విత్తనాలను గుడ్డ సంచిలో కట్టి, ఈ ద్రావణంలో నానబెట్టాలి. తరువాత విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవచ్చు.
- పశువుల మూత్రం – మజ్జిగ ద్రావణం చల్లడం
లీటర్ పశువుల మూత్రాన్ని, లీటర్ మజ్జిగను, 8 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారి చేయాలి.
- మారేడు ఆకు – పశువుల మూత్రం కషాయం
కిలో మారేడు ఆకులు తీసుకుని 5 లీటర్ల నీటిలో ఉడకబెట్టి చల్లార్చాలి. దీనికి 5 లీటర్ల పశువుల మూత్రంతో పాటు, 100 గ్రాముల సున్నం కలపాలి. దీనికి 100 లీటర్ల నీటిని కలిప పిచికారి చేసుకోవచ్చు.
- పశువుల పేడ – పశువుల మూత్రం – ఇంగువ కషాయం
ఒక కుండలో 5 కిలోల పేడ, 5 లీటర్ల పశువుల మూత్రం, 5 లీటర్ల నీటిని కలిపి 5 రోజులు మురగబెట్టాలి. రోజూ ఒక పుల్ల తీసుకుని కలియబెడుతూ ఉండాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడబోసి, 100 గ్రాముల సున్నం కలిపి, 250 గ్రాముల ఇంగువ కలిపి పిచికారి చేయాలి.
అనుకూల వాతావరణం
- 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత
- గాలిలో 90% కంటే ఎక్కువ తేమ
- రాత్రి పూట మంచు బిందువులు ఆకుల మీద పడటం
పై మూడు పరిస్థితులు వారం రోజుల పాటు ఉంటే ఈ తెగులు ఎక్కువ అవుతుంది.
- పొడ తెగులు లెక మూగుడు తెగులు
పొడ తెగులును పాము పొడ తెగులు లేదా మాగుడు తెగులు అని కూడా అంటారు. ఇది రోగ బీజాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ బీజాలకు 21 నెలల వరకు మొలక శక్తి ఉంటుంది. పొలంలోనూ, గట్ల మీద ఉన్న కలుపు మొక్కల ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు
ఆకు తొడిమెల మీద ముందుగా వలయాకారంలో బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. అవి క్రమంగా పెద్దవిగా మారి పాము పొడ వంటి మచ్చలుగా మారతాయి.
మచ్చలు పెరిగిన తరువాత అంచు గోధుమ రంగులోనూ, మచ్చ బూడిద రంగులోనూ ఉంటుంది.
మచ్చలు ఒక దానితో ఒకటి కలిసి, చివరకు ఆకులు, తరువాత మొక్కలు ఎండిపోతాయి. గింజలు సరిగా పాలుపోసుకోవు.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు, గింజలు
తెగులు జీవిత చక్రం
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- సిఫారసు చేసిన నత్రజని ౩-4 సార్లు వేయాలి.
- గట్లపైన , చేనులో కలుపు లేకుండా చూడాలి.
- లీటర్ నీటికి 2 మిల్లి లీటర్లు హేక్షా కొనజోల్ లేక 2 మిల్లి లీటర్లు వలిడా మైసిన్ లేదా మిల్లి లీటర్ ప్రోపికోనజోల్ కలిపి 15 రోజులకు ఒకసారి రెండు పర్యాయాలు పిచికారి చేయాలి.
- తట్టుకునే వంగడాలు (దీప్తి, పంకజ్, ఎం.టి.యు. 101౩ రకాలు)
- నాణ్యమైన, మంచి విత్తనం వాడటం
- విత్తన శుద్ధి (పశువుల మూత్రం, వస గడ్డతొ కలిపి)
- కలుపు మొక్కలు ఏరివేయడం (ప్రత్యేకించి గట్ల మీద ఉన్నవి)
అనుకూల వాతావరణం
25 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత, గాలిలో ఎక్కువ తేమ, మబ్బులు పట్టిన వాతావరణం చెట్ల నీడ ఎక్కువగా ఉన్నా ఈ తెగులు ఎక్కువవుతుంది.
బాక్టీరియా వల్ల వస్తుంది. దీనినే ఎండాకు తెగులు అనికూడా అంటారు. నవంబర్ – ఫిబ్రవరి మధ్య కాలంలో పంటను ఆశిస్తుంది.
లక్షణాలు
ఆకు కొన భాగంలో ముందు అంచుల దగ్గర 5-10 మిల్లి మీటర్ల పొడవు కలిగిన ఆకుపచ్చని లేదా పసుపు పచ్చని మచ్చలు ఏర్పడతాయి. ఆకు చివరినుంచి కింది వరకు ఒక పక్క గాని, లేక రెండు పక్కల గాని, లేదా ఆకు మధ్య భాగంలో కాని తడిచినట్లు ఉండి మచ్చగా మారుతుంది. రోగం సోకిన భాగం పూర్తిగా ఎండిపోతుంది. పచ్చగా మారిన చోట ఉదయం 7 గంటలకు చూస్తే, పచ్చని జిగురు వంటి పదార్థం పైకి వస్తుంది. ఈ ద్రవ పదార్థంలో ఉండే సూక్ష్మ జీవులు, నీటి ద్వారా వ్యాపించి, ఇతర మొక్కలకు రోగాన్ని చేరవేస్తాయి. రోగం తీవ్రమైన కొద్దీ ఈ ఎండు చారలు ఒకదానితో ఒకటి కలుస్తాయి. చివరకు ఆకులు మొత్తంగా ఎండినట్లు కనపడతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
ఆకులు
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- తెగులు ఎక్కువగా ఉంటే నత్రజని వేయడం ఆపివేయాలి
- తట్టుకునే వంగడాలు (స్వర్ణ, అజయ్, మసూరి, సస్యశ్రీ రకాలు)
- కలుపు, పంట వ్యర్ధాలను నాశనం చేయడం (పంట కోత తరువాత వరి దుబ్బులను కాల్చి వేయడం)
- నాణ్యమైన, మంచి విత్తనం వాడటం
- పశువుల పేడ ద్రావణం పిచికారి చేయడం
- మబ్బులు కమ్మినప్పుడు, జల్లులు పడుతున్నప్పుడు నత్రజని ఎరువులు వేయకపోవడం
అనుకూల వాతావరణం
30 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో ఎక్కువ తేమ, జల్లులు కురిసే వాతావరణం లేదా గాలివాన కురిసే సమయం తెగులు వ్యాప్తికి అనుకూల సమయం. పోషక లోపాలు ఉన్నప్పుడు కూడా తెగులు ఎక్కువవుతుంది.
|
పొలంలో ఈ తెగులు, వ్యాధి సోకిన మొక్క ల భాగం నుండి, విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. తర్వాత నీటి ద్వారా మిగిలిన పొలాలకు విస్తరిస్తుంది. కాండం కుళ్ళు తెగులు వరితో పాటు కందిని కూడా ఆశిస్తుంది.
లక్షణాలు
కాండం లోపల కణువుల మధ్య భాగమంతా నల్లగా మారుతుంది. ఆకులు పసుపురంగుకు మారి పిలకలు చనిపోతుంటాయి. పాలు పోసుకునే దశలో కాండం కుల్లిన ప్రదేశం దగ్గర పిలకలు వాలిపోయి ఎండిపోతాయి. క్రమంగా దుబ్బు అంతా ఎండిపోతుంది.
మొక్కలో పాడయ్యే భాగాలు
కాండం
తెగులు జీవిత చక్రం
తెగులు నియంత్రణ – నివారణ పద్దతులు
- రసాయన పద్దతులు
- లీటర్ నీటికి 2 మిల్లి లీటర్లు హేక్షా కొనజోల్ లేక 2 మిల్లి లీటర్లు వలిడా మైసిన్ లేదా గ్రాము కార్బండైజిం లేదా గ్రాము బెనోమిల్ కలిపి 15 రోజులకు ఒకసారి రెండు పర్యాయాలు పిచికారి చేయాలి.
- జీవ పద్దతులు
- తెగులు సోకిన పొలంలో పరిశుభ్రత పాటించాలి.
- మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
- విత్తన శుద్ధి చేయాలి.
- అనుకూల వాతావరణం
|
|