దబోల్కర్ పధ్ధతి
దబోల్కర్ పధ్ధతి : భూసారం పెంచుకోవటానికి మన ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్రకి చెందిన దబోల్కర్ అనే శాస్త్రవేత్త కొన్ని సూచనలు చేసారు.
దాన్యపు గింజలు : 5 కేజీలు (మొక్కజొన్న, జొన్న, సజ్జ, తైదులు, రాగులు మొ...)
పప్పు గింజలు : 5 కేజీలు (మినుములు, పెసలు, శనగలు, కంది, అలసంద మొ...)
నూనెగింజలు : 5 కేజీలు (నువ్వులు, వేరుశెనగ, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, మొ...)
సుగంధ ద్రవ్యములు : 5 కేజీలు (ఆవాలు, మెంతులు, ధనియాలు, కరివేపాకు, పుదీనా మొ...)
పచ్చిరొట్ట పంట విత్తనాలు : 5 కేజీలు (జనుము, జీలుగ, అవిశ, గ్లైరిసీదియం మొ...)
దుక్కి దున్ని మండలాగిన తరువాత ఈ పై విత్తనాలన్నీ కలగలిపి ఎకరానికి 20-25 కేజీలను చల్లుకోవాలి. ౩౦-40 రోజుల వరకు పెరగనిచ్చి భూమిలో కలియదున్నాలి.
ఇలా చేయడం వలన పంట కాలం నష్టపోతామని భావించినట్లయితే రైతులు తమ పొలాన్ని కొన్ని భాగాలుగా విభజించుకొని, ఏటా ఒక భాగంలో ఈ పధ్ధతి పాటిస్తూ కొద్ది సంవత్సరాలలో మొత్తం పొలాన్ని సారవంతంగా చేసుకోవచ్చు.