పక్షి స్థావరాలు;
పక్షులు వాలుటకు అనువుగా పంగల కర్రలు పాతాలి.
పక్షులను ఆకర్షించుటకు కొరకై చిన్న పాత్రలో నీరు వుంచడం, పసుపు కలిపిన అన్నం పొలంలో చల్లడం వంటివి చేయాలి.
సాధారణంగా ఒక ఎకరానికి 20 పంగల కర్రలు అవసరవుతాయి.
తక్కువ ఎత్తు పెరిగే శనగ, వేరుశనగ వంటి పంటలలో తెల్ల కొంగలు, ఇతర పంటలలో ముఖ్యంగా కర్రె పిట్టలు మరియు ఇతర పక్షులు పురుగులను అదుపు చేస్తాయి.
అదేవిధంగా వరి పంటలో (గింజలు ఏర్పడే దశ ముందు) ఎకరానికి 20 చొప్పున పంగల కర్రలను ఏర్పాటు చేస్తే పక్షులు వాటిమీద కూర్చొని అకుముడత , గొట్టాల పురుగులను ఏరుకొని తింటాయి.
ఈ కర్రలను పంట గింజకట్టు దశలో తీసివేయాలి. పురుగు మందులు వాడని పొలాలలో ఈ పక్షులు ఎక్కువగా వాలతాయి.