వ్యాప్తి:

చుట్టుపక్కల  వున్న  గడ్డి జాతుల మొక్కలపై వున్న శిలీంద్ర స్పోరులు తెగులుకు మూలకారణం.

మొక్క యొక్క కణజాలం గాయపడినప్పుడు స్పోరులు విడుదల అవుతాయి. ఇవి నేలలోకి వెళ్ళవచ్చులేదా పంటలపై గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి.

నేలలో 5-10 రోజులు  సజీవంగా వుంటాయి.

నీటి ద్వారా ఇతర ప్రదేశాలకు వ్యాప్తి చెందుతాయి.

ముందుగా విత్తిన మొక్కజొన్న తెగులును తప్పించుకుంటుంది. తెగులును తట్టుకోలేని మొక్కజొన్న పంట మొలకెత్తిన నాలుగు వారాల లోపు శిలీంద్ర స్పోరులు కణజాలంలోకి ప్రవేసిస్తాయి.