పత్తి

పత్తి ఉత్పత్తి, నూలు ఎగుమతుల్లో భారత దేశం ప్రపంచంలోనే ప్రధాన పాత్ర పోషిస్తున్నది. భారత దేశంలోని పత్తి సాగు విస్తీర్ణంలో మన రాష్ట్ర వాటా 9.6 శాతం.  దేశీయంగా మొత్తం పత్తి ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ వాటా 8.4  శాతం వరకు ఉంది.  ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ౩౩. 25 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. స్థూలంగా 5 లక్షల బేళ్ళ ఉత్పత్తి జరుగుతోంది. సరాసరిన ఎకరాకు 670 కిలోల దిగుబడి అందుతోంది.