బెరడు తొలుచు పురుగు  
ఈ పురుగులు కాండం బెరడును తినివేసి విపరీత నష్టాన్ని కలుగజేస్తాయి. లార్వా పురుగులు కొమ్మల్లో బొరియలు చేస్తాయి. దీని  నివారణకు పురుగు విసర్జించిన పదార్థాన్ని తీసివేసి, ఆ రంధ్రాలలో మిల్లి లీటరు డేక్లోరోవాస్ 1౦ మిల్లి లీటర్ల నీటిలో కలిపి లేదా లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల ఎండో సల్ఫాన్  కలిపి ఆ మందును  రంధ్రాల్లో పోయాలి.

తామర పురుగులు
కాయలు చిన్న పిందెలుగా ఉన్నప్పుడు రసం పీల్చి కాయలఫై పొడలుగా తామరను కలిగిస్తాయి. దీని నివారణకు కాయలు పిందెలుగా  ఉన్నప్పుడే లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల డైమితోయేట్, 2 మిల్లి లీటర్ల సిప్రొనిల్ కలిపి కాయలు బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

 

పిండి నల్లి
ఈ పురుగు చెట్ల పాదుల్లో అభివృద్ది చెందుతుంది. రెండవ దశ పురుగులు నేల నుండి చెట్ల పైకి ప్రాకి చెట్టు రసాన్ని పీల్చి హాని కలిగిస్తాయి. దీని నివారణకు గాను పొలాన్ని వేసవిలో దున్నాలి. నేలను తాకే కొమ్మలను కత్తిరించాలి.  లీటరు నీటికి 5 మిల్లి లీటర్ల  వేప నూనెను కలిపి పిచికారి చేయాలి. 2 శాతం ఫాలిదాల్ పొడిని పాదులో వేసి కలియబెట్టాలి. చెట్ల మొదల్లకు 4౦౦ గేజ్ అల్మద్దిన్ షీట్ నవంబర్-డిసెంబర్  మాసాల్లో ఒక అడుగు ఎత్తు వరకు కట్టాలి. లీటర్ నీటికి కార్బారిల్ 5౦ శాతం తడి పౌడర్ 4 గ్రాములు, లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లి లీటర్లు  కలిపి చెట్టు మొదలు, కొమ్మలు, రెమ్మలు ఆకులు తడిచేటట్లు పిచికారి చేయాలి. కాయలు కోత దశలో వునప్పుడు ఈ మందులు పిచికారి చేయరాదు. క్రిప్టోలీమస్ మాంత్రోజరీ అనే పరాన్న జీవులను చెట్లఫై విడుదల చేయాలి.

 

అకుముడుత పురుగు
దీని  పిల్ల పురుగులు ఆకులను చుట్టి పత్రహరితాన్ని తినడం వలన కిరణజన్య  సంయోగ క్రియ తగ్గుతుంది. దీని నివారణకు లీటర్ నీటికి 2 మిల్లి లీటర్ల మలాధియాన్  లేదా 1.5 మిల్లి లీటర్ల మొనోక్రోటోఫాస్ కలిపి 10 – 12  రోజుల వ్యవదిలోఅవసరాన్ని బట్టి పిచికారి చేయాలి.

గాల్ పురుగు
పిల్ల పురుగులు వర్షాకాలంలో కొమ్మల చివరి భాగంలో రంద్రాలు చేస్తాయి. దానివల్ల కంతులు ఏర్పడతాయి. కొమ్మల పెరుగుదల దెబ్బతింటుంది. దీని నివారణకు లీటరు నీటికి 2 మిల్లి లీటరు డైమిధోయేట్ కలిపి పిచికారి  చేయాలి.

పేనుబంక
ఈ పురుగులు రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగచేస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల డైమిధోయేట్ కలిపి పిచికారి చేయాలి. పూత సమయంలో ఆశిస్తే విపరీత నష్టం  కలుగచేస్తాయి.

 

తుప్పు తెగులు
ఆకులఫై, కాయలఫై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాయలు కోతకు తయారు కాక ముందే రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల క్లోరోధలోనిల్ లేదా 2.5 గ్రాముల మంకోజోబ్ కలిపి పిచికారి చేయాలి.

నల్ల మచ్చలు
కాయలఫై గోధుమ రంగు నీటి బుడగల మాదిరి బొడిపెలు ఏర్పడతాయి. రాను రాను ఇవి పెద్దవవుతాయి. దిని నివారణకు లీటరు నీటికి ౩ గ్రాముల కాపర్ అక్సిక్లోరైడ్ లేదా 1 శాతం బోర్డ్ మిశ్రమం చల్లాలి. తొలకరి వర్షాలు పడగానే  కాయ పెరుగుదల ఆరంభమైన దశలో 15 రోజుల వ్యవధిలో బాగా తడిచేలా రెండుసార్లు పిచికారి చేయాలి.

కాయకుళ్ళు తెగులు
కాయల ఫై గోధుమ రంగుతో నీటి బూడగల లాగా వుంది పెద్దవైనకొలది నీటి ఆకుపచ్చ రంగులోకి మారి పసుపు వర్ణంలో నున్న ద్రవపు చుక్కలు కనిపిస్తాయి. కాయల నుంచి చెడువాసన వస్తుంది. దీని నివారణకు కాయలను నిల్వ చేసేటప్పుడు 1 శాతం బోరాక్స్ (1౦గ్రా.ల బోరాక్స్ లీటరు నీటిలో కలిపి ) లేదా 2 శాతం ఉప్పు ద్రావణంలో ముంచి తీయాలి.

పండ్లపై మచ్చలు
 గోధుమ రంగులో మొదలై నలుపు గోధుమ రంగులోకి మారుతాయి. ఈ తెగులు సాధారణంగా బోరాన్ లోపం వల్ల వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు  లీటరు నీటికి 6 గ్రాముల బోరాక్స్ మందు కలిపిన ద్రావణాన్ని కాయలు పెరిగే దశలో ౩ దఫాలుగా 15 రోజుల వ్యవదితో పిచికారి చేయాలి.