మొగ్గతొలిచే పురుగు :
పిల్ల పురుగులు లేత గులాబీ రంగులో ఉంటాయి. ఇవి లేత పూమొగ్గలను తొలచి తినివేయడం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. జూలై నుండి నవంబర్ వరకు ఈ పురుగు ఆశిస్తుంది.
ఆకుగూడు అల్లే పురుగు :
జూలై నుండి నవంబర్ వరకు ఈ పురుగు ఉదృతి కనపడుతుంది. పిల్ల పురుగులు లేత, ముదుర ఆకులను గూళ్ళుగా చేడుకుని ఆకులను తినడం, గోకడం వంటివి చేస్తాయి. ఈ విధంగా లేత చిగురు, పూతకు హాని చేస్తాయి. ఈ పురుగులు అప్పుడప్పుడు కాయలకు కూడా హాని చేస్తుంది. .
కాయను తొలిచే పురుగు :
ఈ పురుగు సాధారణంగా సరైన యాజమాన్య పద్ధతులను పాటించి తోటలో వస్తుంది. పురుగులు కండ ద్వార గింజను చేరుకొని గింజను తింటాయి. దీనివల్ల కండ పాడవక పోయినా, కొనే వారిలో అయిష్టత ఏర్పడుతుంది.
పై పురుగులను నిర్మూలించడానికి లీటరు నీటికి 2 మిల్లి లీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా ఎండోసల్పాన్ లేదా 1.6 మిల్లి లీటర్ల మొనోక్రోటోఫాస్ లేదా ౩ గ్రాముల కార్బారిల్ కలిపి ఆకులు, చిగుళ్లు, కొమ్మలు పూర్తిగా తడిసేలా పిచికారి చేయాలి. ఈ మందులను అవసరాన్ని బట్టి మారుస్తూ వాడుకోవాలి. తోటలో కలుపు లేకుండా శుభ్రత పాటిస్తే చాల వరకు చీడలను ఆరికట్టవచ్చు. |